Thursday, December 22, 2005

ఏమి జరుగుతుంది.

మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.

మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.
జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి లేక పొయే.

నిజ్జంగా మన పోలీసుబాబులు చెప్పినట్లు చంపడమే లక్ష్యం ఐతే, పండగ ముందు రోజు దాడి ఎందుకు చేస్తారు?
అట్లాకాక వాళ్ళ లక్ష్యం, పోలీసులకి హెచ్చరిక పంపడమా?లేక పోలీసుల దగ్గర ఉన్న ఆదారాలు నాశనం చెయ్యడమా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సింది, మన పోలీసులు దాడి జరక ముందు కొంతకాలం గా వీళ్ళ కార్యక్రమాల మీద చాలానే ఆదారాలు సంపాదించారు. వాటిని నాశనం చెసె లక్ష్యం గా దాడి జరిగి ఉంటె, ఆ ముష్కరులు తమ పనిలో చాల వరకు విజయం సాదించారు.

2 comments:

Anonymous said...

Mundu MUJEEB lantollaki remission ichina YS govt gurinchi kuuda maatladu sodaraa ! Gouru Venkata REDDY saab lagane raacha maryadalatho MUJEEB bayatiki velladu gada !

Muslims ki reservations..jail vidudalalu ichi..pamulni penchi poshisthunte..pachapatrikala meeda padi yedavadam enduko ?

mundu mana bangaram manchidi avvaligaa..mana bangaram gurinchi cheppi..tarvatha kaagithala gurinchi matladadaam

Subhash Pasupuleti said...

bagundhi